‘నోటా’ ఓట్లు 50 శాతం దాటితే మాత్రం..! మాజీ సీఈసీ ఏమన్నారంటే..
ఇందౌర్ స్థానంలో ‘నోటా’కు ఓటేయాలంటూ కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అయితే, ఎన్నికల ఫలితాలపై ‘నోటా’ ప్రభావం నామమాత్రమేనని మాజీ సీఈసీ ఓపీ రావత్ తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: ‘నోటా (NOTA)’కు ఓటేయాలంటూ మధ్యప్రదేశ్లోని ఇందౌర్లో కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేస్తోన్న విషయం తెలిసిందే. తమ అభ్యర్థి చివరి క్షణంలో నామినేషన్ ఉపసంహరించుకుని, భాజపాలో చేరిపోవడంతో.. హస్తం పార్టీ పోటీలో లేకుండా పోయింది. దీంతో పోటీలో ఉన్న వారెవరికీ మద్దతు ప్రకటించకుండా.. ‘నోటా’ మాటెత్తుకుంది. అయితే, ఎన్నికల ఫలితాలపై ‘నోటా’ ప్రభావం నామమాత్రమేనని మాజీ సీఈసీ ఓపీ రావత్ తెలిపారు. ఒకవేళ దీనికి 50 శాతానికిపైగా ఓట్లు వస్తే మాత్రం.. ఎన్నికల ఫలితాలపై దాని ప్రభావం పడేలా చర్యలు తీసుకోవడంపై ఆలోచించాల్సి ఉంటుందన్నారు.
‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ‘నోటా’కు నామమాత్రపు ప్రాముఖ్యమే ఉంది. ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపదు. ఒక స్థానంలో 100 ఓట్లలో నోటాకు 99, అభ్యర్థికి ఒక ఓటు వచ్చినా.. అభ్యర్థే విజేతగా నిలుస్తారు. ఒకవేళ నోటాకు 50 శాతానికిపైగా ఓట్లు వస్తే.. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులను తాము అర్హులుగా పరిగణించడం లేదని ఓటర్లు చాటుతున్నట్లే. దీంతో పార్లమెంటు, ఎన్నికల కమిషన్పై ఒత్తిడి పెరుగుతుంది. ఎన్నికల ఫలితాలపై ఈ ఓట్లను ప్రభావితం చేయడానికి చట్టాలను మార్చడం గురించి వారు ఆలోచించాల్సి ఉంటుంది’’ అని ఓపీ రావత్ తెలిపారు. 2019 ఎన్నికల్లో ఇందౌర్లో 5045 ఈ ఓట్లు నమోదయ్యాయి.
‘నోటా’ కోసం కాంగ్రెస్ విస్తృత ప్రచారం.. ఇందౌర్లో విచిత్ర పరిస్థితి!
భారత్లో 2013 వరకు అభ్యర్థులు నచ్చకున్నా, సరైనవారు పోటీలో లేరని భావించినా.. ఎవరికో ఒకరికి ఓటేయాల్సిన పరిస్థితి ఉండేది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి.. 2013లో ‘నోటా’ను ప్రవేశపెట్టారు. ఆ ఏడాది దిల్లీ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తొలిసారిగా దీనిని అమలు చేశారు. 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో దీనికి సగటున రెండు శాతం కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. 2019 ఎన్నికల్లో బిహార్లోని గోపాల్గంజ్లో ఏకంగా 51,660 మంది దీనికి ఓటేశారు. పోలైన మొత్తం ఓట్లలో ఇవి ఐదు శాతంతో సమానం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
తాజా వార్తలు
-
రేపల్లె సమీపంలో ట్రాక్టరు బోల్తా.. 20 మందికి గాయాలు
-
పరువు నష్టం కేసు.. దోషిగా తేలిన మేధా పాట్కర్
-
రేవ్ పార్టీపై రగడ.. ‘ఉడ్తా బెంగళూరు’పై కన్నడనాట మాటల యుద్ధం
-
ఫోన్కి అతికించండి.. ట్యాప్ చేయండి.. పిన్ లేకుండానే ఎంచక్కా పేమెంట్స్
-
కౌంటింగ్ రోజు పిన్నెల్లి మాచర్లకు వెళ్లొద్దు: ఏపీ హైకోర్టు
-
‘పెట్స్’తో రష్మిక ఫొటోలు.. స్నేహితులతో రాశీఖన్నా సందడి